02 August, 2013

నేటి రాజకీయం

అక్షరం వచ్చినోల్లు అమెరికాకి
అక్షరం నేర్చనోల్లు అసెంబ్లీకి
వర్తమానం బంధుల్లోకి
భవిష్యత్తు భూడిదలోకి.           
-------------------------
నోటిస్తే ఓటేశాడు
మద్యంపోస్తే జైకొట్టాడు 
సామాన్యుడు మూర్ఖుడు
లాలంతో సంతృప్తిపడి
గుర్రాన్ని వదిలేశాడు.     
-----------------------------
మాతెలంగాణాతల్లికి 
మల్లెపూదండ
మాతెలుగుతల్లికి 
కన్నీటిహారతులు.
ఆకలితో ప్రజలు అలమటిస్తుంటేను.              
రహదారుల్లో జనం రాల్లువిసురుతుంటేను.           
------------------------------------------------
భూములని తిన్నారు
గనులని తిన్నారు
గడ్డిని తిన్నారు
ఇసుకనూ తిన్నారు
అయినా..
పిచ్చిజనం
దేశద్రోహులను 
పల్లకిలో ఊరేగించారు.          
--------------------------
అవినీతి పురుగు
ఆకులను తొలిచింది
కొమ్మలను తొలిచింది
కాండాన్ని తొలిచింది.
ఇక తల్లివేరుని తొలిచేది కాయం 
వృక్షం కూలేది కాయం.      
-----------------------------
తప్పు నాయకులది కాదు ప్రజలది.  
రాజకీయసేద్యంలో
కలుపుమొక్కలని పెంచారు
పండేమొక్కలని పెరికేశారు
ప్రతి అయిదు సంవత్సరాలకి  
పండే.. ఒకటే పంట 
కడుపు మంట    
ఆకలి అంటే ఎలా?        


3 comments:

  1. ఆంధ్రసీమలో తెలంగాణాలో అవినీతిపరులైన రాజకీయనాయకులను ఓడించి వెనుకపడిన తరగతుల యువకులకు పట్టం కట్టాలి!

    ReplyDelete
  2. Good post. The next phase of Telangana movement is reconstruction in the Telangana state

    ReplyDelete