పండంటి పసివాడు
బోసినవ్వులు నవ్వాడుఇల్లు పూదోటై వికసించింది.
పండుముసలివాడు
బోసినవ్వులు నవ్వాడు
మౌనం పాషాణమై
వాడిమనసును హరించింది.
పండంటి పసివాడు ఏడ్చాడు
పరివారం వాడిపాదాల నిలిచి బుజ్జగించింది.పండుముసలివాడుఏడ్చాడు
పట్టించుక్కున్నవారేలే రు.
పండంటి పసివాడు
అన్నమడిగాడువెన్నెలచూపిస్తూ అమ్మ అన్నం తినిపించింది.
పండుముసలివాడు
ఆకలన్నాడు
కనినవారులేరు.. వినినవారులేరు.
అంతే...
పందిటకు వేలాడింది
పండువెన్నెల్లో ఒక ప్రాణం.
తీరాన నిలబడి
అలలను చూస్తూ..
కడలిని మరిచిపొయారు మూర్ఖులు.